Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
డిసెంబర్ 12న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శాంతి చర్చల ప్రతినిధి చర్చల చంద్రన్న సంస్మరణ సభను ఏర్పాటు చేస్తున్నట్లు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ తెలిపారు. చంద్రన్న సహచరులు, ఉద్యమం మిత్రులు బంధుమిత్రుల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ తాడిత పీడిత ప్రజల విముక్తి కోసం కుల, మత, వర్గ రహిత సమాజ నిర్మాణం కోసం చంద్రన్న చేసిన పోరాటాలను భవిష్యత్ తరాలకు తెలియజేయడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. నకిలీ ఎన్కౌంటర్ల నిర్మూలన కోసం చంద్రన్న కృషి చేశారని గుర్తు చేశారు. రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2005లో ప్రభుత్వానికి నక్సలైట్లకు జరిగిన శాంతి చర్చల్లో పాల్గొన్న చంద్రన్న భూమి, ఉపాధి కార్మిక సంక్షేమం, విద్యార్థి, మహిళా సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచడంలో సఫలీకృతమయ్యారు అని పేర్కొ న్నారు. డిసెంబర్ 12న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే సంస్మరణ సభను అభ్యుదయ వాదులు ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున పాల్గొని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాదిగ ఉపకులాల ఐక్యవేదిక అధ్యక్షులు ప్రొఫెసర్ ఏకు తిరుపతి, కె చంద్రశేఖర ప్రసాద్, చంద్రన్న మిత్ర మండలి అధ్యక్షులు ధనలక్ష్మి, కె నరసయ్య, సురేందర్ పాల్గొన్నారు.