Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
తులసి కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సంస్థ మరింత బలోపేతానికి చర్యలు చేపడుతున్నట్లు సొసైటీ అధ్యక్షులు ఎం శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ఈమేరకు సోమవారం బతుకమ్మ కుంటలోని సైటు 2లో సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో అధ్యక్షులు శ్రీనివాస్ కుమార్ కార్యదర్శి ఈఎం లింగమయ్య గౌడ్ పలు తీర్మానాలు చేశారు. సొసైటీకి జీహెచ్ఎంసీ స్థల సేకరణ నాలుగు స్థలలు కేటాయించిందని, ఇది 2010లో రిజిస్ట్రేషన్ కూడా అయిందని వారు వెల్లడించారు. జీహెచ్ఎంసీ చట్టప్రకారం భూమి సేకరణ చేసిన భూమిపై పూర్వపు యజమానుల వారసులు తమవంటూ దుష్ప్రచారం చేస్తున్నారని దీనిపట్ల సభ్యులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే కొంతమంది వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సష్టించి న్యాయస్థానం తప్పుదోవ పట్టిస్తున్నారని, అలాంటి వారిపై చట్టం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బాగ్ అంబర్ పేట సొసైటీ వారు తమకు కూడా వాటా ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని అలాంటి వారిపై చట్ట ప్రకారం పోలీసులు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కోశాధికారి రాము, ప్రతినిధి శేష్ కుమార్, సూర్యనారాయణ, ఆర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.