Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
నవంబర్ 12,13, 14 తేదీల్లో ఖమ్మంలో జరిగిన పీడీఎస్యూ రాష్ట్ర శిక్షణ తరగతుల జనరల్ కౌన్సిల్ సమావేశంలో సూర్యాపేట్ జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన ఓయూ విద్యార్థి గడ్డం శ్యామ్ను పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా గడ్డం శ్యామ్ మాట్లాడుతూ జార్జి, జంపాల, శ్రీపాద, కోలా, రంగవల్లి, వీరన్న లాంటి అమరుల స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యార్థి, ప్రజా వ్యతిరేక విధానాలపై శక్తివంచన లేకుండా పోరాడుతానని తెలియజేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ లను తక్షణమే విడుదల చేయడంతోపాటు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.