Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
పీజీ కోర్సుల ఫీజులు తగ్గించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎల్ మూర్తి డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం ఎస్ఎఫ్ఐ ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యం ఏడాది పీజీ కోర్సుల ఫీజును మూడింతల రెట్టింపు పెంచడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. ఒక వైపు కరోనాతో ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇలాంటి సమయంలో ఫీజులు పెంచడం బాధాకరం అని అన్నారు. పెంచిన ఫీజులు తగ్గించే వరకు ఉద్యమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రవి నాయక్, రాష్ట్ర నాయకులు అరవింద్, నాయకులు గోపీనాథ్, సతీష్, ముస్తావీక్, అఖిల్, లక్ష్మణ్, హరీష్, నవీన్ పాల్గొన్నారు.