Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొగ్గు గనుల ప్రయివేటీకరణను నిలిపివేయాలి
ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షులు సాధినేని వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-అడిక్ మెట్
సింగరేణి బొగ్గు గనుల ప్రయివేటీకరణను నిలిపివేసి, రాకë ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవాలని ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షులు సాధినేని వెంకటేశ్వర రావు డిమాండ్ చేశారు. ఆ సంఘం రాకë అధ్యక్షులు ఆరెపల్లి కృష్ణ అధ్యక్షతన సోమవారం విద్యా నగర్లోని చంద్రపుల్లా రెడ్డి భవన్లో ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాధినేని వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులతోపాటు దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకులను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జాతి వ్యతిరేకమైనదని, బొగ్గు గనుల ప్రయివేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యవల్ల దేశంలోని బొగ్గు పరిశ్రమ మనుగడ ప్రమాదంలో పడిందన్నారు. సింగరేణికి 135 ఏండ్ల చరిత్ర ఉందని, అనేక శతాబ్దాలపాటు తీయగల బొగ్గునిక్షేపాలు భూగర్భంలో ఉన్నాయని గుర్తు చేశారు. పాతికేళ్లుగా వేల కోట్ల రూపాయల లాభాలతో నడుస్తున్న సింగరేణిలో భూగర్భ గనులను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తీయటానికి ఉద్యోగాలను పెంచుకోవటానికి తగిన అవకాశాలు ఉన్నాయని, అలాంటిది బొగ్గు గనులను ప్రయివేట్పరం చేయవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. సింగరేణిలో రాష్ట్రప్రభుత్వానికి ఇప్పటికే 51 శాతం వాటాలు ఉన్నందున, పూర్తిస్థాయి వాటాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోని సింగరేణిని నడిపిస్తామని వాగ్దానం చేసిన సీఎం కేసీఆర్ కేసీఆర్ నేడు కేంద్ర ప్రభుత్వం సింగరేణి నాలుగు బ్లాకులను అమ్మకానికి పెడుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, సింగరేణికి జీఎల్బీకేఎస్ రాకë ప్రధాన కార్యదర్శి జే.సీతారామయ్య సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.విశ్వనాథ్, ఎండీ రాసుద్దీన్, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి జి.అనురాధ తదితరులు పాల్గొన్నారు.