Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిదిలోని మచ్చ బొల్లారం సాయి రెడ్డికాలనీలో ఈ నెల 2వ తేదీన ఓ ఇంట్లో సుమారు 8 తులాల బంగారు నగలు, రూ.80 వేల నగదు, ల్యాప్ టాప్ను ఎత్తుకెళ్లిన దొంగను సీసీ టీవీ పుటేజీ సీడీఆర్ డాటా ఆధారంగా సోమవారం దొంగతనానికి పాల్పడ్డ చిగురుపాటి మహేష్ను అల్వాల్ మచ్చ బొల్లారం పరిధి రాయల్ ఎంక్లేవ్లోని అలేఖ్య అపార్టు మెంట్లో పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం ప్రయివేటు గ్రాసరీ కంపెనీలో పని చేస్తూ చిత్తూరు జిల్లాకు చెందిన మహేశ్ ఐదేండ్లుగా డీఏఎఫ్ఏ, బెట్ 366, బెట్ వే, 22 బెట్, 1 బెట్ ఆప్ అనే వివిధ రకాల బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ చేసేవాడని తెలిపారు. దీని వల్ల బెట్టింగ్ వ్యసనంగా మారిపోయి చివరికి తన తల్లి బంగారు నగలు, డబ్బులను దొంగతనం చేసి వచ్చిన డబ్బులతో బెట్టింగ్ ఆడేవాడని తెలిపారు. దీంతో ఇంట్లో వాళ్ళతో గొడవపడి బయటకి వచ్చి తన స్నేహితుడి సాయంతో అల్వాల్కి వచ్చి ఓ ప్రయి వేటు కంపెనీలో పనిచేస్తూ ఇక్కడ కూడా బెట్టింగ్ వ్యసనం కావడంతో తనకు వచ్చే జీతం సరిపోక ఆఫీస్లో పని చేసే తోటి వారి వద్ద నుంచి అప్పులు చేశాడు. వారు పదే పదే అప్పు ఇచ్చిన డబ్బులు ఇవ్వమని అడుగుతుండటంతో ఏదైనా దొంగతనం చేసి వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చవచ్చని, ఎక్కువ డబ్బులు బెట్టింగ్ పెట్టవచ్చు అనే ఉద్దేశంతో ఈనెల 1వ తేదీ మధ్యాహ్నం సమయంలో మచ్చ బోల్లారంలోని సాయిరెడ్డి కాలనీలో తిరుగుతుండగా ఒక ఇంటికి తాళం వేసి ఉండటం గమనించి ఇంటి గేటు దూకి మెయిన్ డోర్ తాళం పగల గొట్టి ఇంట్లోని తాళం లేకుండా బీరువా నుంచి సుమారు 8 తులాల బంగారం, రూ.80 వేల నగదు, ల్యాప్ టాప్ను ఎత్తుకెళ్లినట్టు తెలిపారు. ఈ నగదులో సుమారు రూ.70 వేల వరకు ఆన్ లైన్ బెట్టింగ్లో పోగా, మిగిలిన వాటిలో కొంత ఖర్చు చేయగా సు మారు రూ.6 వేలా 7 వందల నగదును సుమారు 9 తులాల బంగారం, ల్యాప్ టాప్ను అల్వాల్ పోలీస్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించ డంలో కృషి చేసిన అల్వాల్ పోలీస్ సిబ్బందిని ఉన్నత అధికారులు ప్రశంసించారని పేర్కొన్నారు.