Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పగిడేరు ఎంపీటీసీ కృష్ణకుమారి
నవతెలంగాణ-మణుగూరు
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బంది లేకుండా, కల్లాలలో ధాన్యం ఆపకుండా కోనుగోలు చేయాలని పగిడేరు ఎంపీటీసీ కుంజా కృష్ణ కుమారి అన్నారు. సోమవారం ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కోనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వ లేకుండా చూడాలని ఆమె కోరారు. కార్యక్రమంలో రైతులు, అధికారులు పాల్గొన్నారు.