Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
నేషనల్ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా దుమ్ముగూడెం మండలానికి చెందిన ఉబ్బా సీతారాములును నియమించారు. నియామకపు ఉత్తర్వులు సంస్థ చైర్మన్ సిహెచ్ విజరు మోహన్, డీజీ సీఈఓ సిహెచ్ ప్రవీణ్రావు నుండి జారీ కాగా నియామకపు పత్రాన్ని సంస్థ వైస్ ప్రెసిండెంట్ విక్రమ్ రాజు చేతుల మీదుగా సోమవారం అందుకున్నారు. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తూ సమ సమాజ స్థాపనకు తన వంతు కృషి చేస్తానన్నారు. సంస్థ ప్రత్యేక సభ్యులుగా సున్నం శేషారావు, ఊడుగుల రవికుమార్, శివకృష్ణ, నవీన్, పీటర్ సింగయ్య, రామర్డ్, తామ కృష్ణారావులను నియమించినట్లు విక్రమ్ రాజు తెలిపారు.