Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
జాయింట్ బైపార్టీ కమిటీ ఫర్ ది కోల్ ఇండిస్టీ (జేబీసీసీఐ) రెండవ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు లేకుండానే వచ్చే ఏడాది జనవరికి వాయిదాపడిందని జేబీసీసీఐ మెంబర్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు తెలిపారు. సోమవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశం వివరాలు ఢిల్లీ నుండి తెలిపారు. జేబీసీసీఐ అగ్రిమెంట్లను, అమలు కాని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేయాలని నాలుగు జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయని తెలిపారు. దీనిపై సింగరేణి యాజమాన్యం 10 సంవత్సరాల అగ్రిమెంట్ను ఒప్పుకోవాలని ప్రతిపాదన చేయగా కార్మిక సంఘాల నాయకులు 5 సంవత్సరాలకే డిమాండ్ చేశారు. మినిమం జీతం ఎంత పెంచుతారు అనే దానిపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని, ఎలాంటి నిర్ణయం జరుగకుండానే తదుపరి సమావేశం జనవరి 2022కి వాయిదా పడిందని తెలిపారు. ఈ సమావేశంలో కోల్ ఇండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్, సీఐటీయూ ప్రతినిధులు డీడీ.రామానందం, సింగరేణి డైరెక్టర్ (పా) ఆపరేషన్స్ ఎన్. బలరామ్, జీఎం అందెల ఆదనంరావు పాల్గొన్నారు.