Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
మత్స్యకార, మత్స్య కార్మిక సాంస్కృతిక సంబరాలు సభలు ఈ నెల 20న నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సంఘం ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తయిందని నాటి నుంచి నేటి వరకు వృత్తిదారుల సమస్యలపై అనేక ఆందోళనా పోరాటాలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ప్రతి సొసైటీకి నాణ్యమైన మూడు అంగుళాలు చేప పిల్లలు ఉచితంగా ఇవ్వాలని చేపల మార్కెట్ లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రతి మత్స్యకారుడికి మోటార్సైకిల్ ఇవ్వాలంటూ సంఘం చేసిన పోరాటాల ఫలితంగా లబ్ధిదారులు అందరికీ చేరుతున్నాయని అన్నారు. ఈ నెల 19 నుంచి 21 వరకు దేశవ్యాప్తంగా ఉన్న మత్స్యకారుల సమస్యలు చర్చించడానికి వీలుగా జాతీయస్థాయి మత్స్యకారుల సమావేశాలను హైదరాబాద్ లోని నిర్వహిస్తున్నట్టు అన్నారు.