Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
జాంబాగ్ డివిజన్ అభివద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ అన్నారు. మంగళవారం డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఉస్మాన్ గంజ్ మార్కెట్ వద్ద ర్యాంప్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలన్నారు. డివిజన్లో ఇరుకుగా ఉన్న రోడ్లను వెడల్పు చేసేలా జోనల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలన్నారు. పూల మార్కెట్ వద్ద నిత్యం మురుగునీరు పారుతుందని దానిపై వెంటనే జీహెచ్ఎంసీ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. డివిజన్లో సీవరేజీ పైప్ లైన్ పురాతనమైనవని వాటి స్థానంలో నూతన లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. పలు బస్తీలలో స్ట్రీట్లైట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జాంబాగ్ అభివద్ధికి నిధులు కేటాయించాలని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్ను కలిసి వినతిపత్రం అందించామని చెప్పారు.