Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ యూనివర్సిటీ పీజీ కళాశాలలో మంగళవారం నుంచి బయోమెట్రిక్ హాజరును ప్రిన్సిపాల్ ప్రో.సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. వారంరోజుల కిందట ఓయూ వీసీ ప్రొ. రవీందర్ యాదవ్ విడుదల చేసిన ఆదేశాల మేరకు యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఫేషియల్ బయోమెట్రిక్ అటెండెన్స్ను కళాశాలలో అమలు చేస్తున్నట్లు ప్రొ. బి. సుధాకర్ రెడ్డి తెలిపారు. బోధన, బోధనేతర సిబ్బందితో పాటు కళాశాలలో ఉన్న వసతి గహంలో కూడా బయోమెట్రిక్ ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. కార్యక్రమంలో అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు