Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
తెలంగాణ ట్రెజరీ డిపార్ట్మెంట్పై వచ్చిన వార్తాకథనాలు పూర్తిగా అవాస్తవమైన ఆరోపణలని తెలంగాణ ట్రెజరీ అండ్ అకౌంట్స్ గెజిటెడ్ సర్వీసెస్ అసోసియేషన్ పేర్కొంది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ పురుషోత్తమ రెడ్డి మాట్లాడారు. గతంలో మాదిరిగా తమ డిపార్ట్మెంట్ వ్యక్తిగత ఖాతాలోకి బిల్లులు పంపించే అధికారం లేదని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఆర్ అండ్ బీ వర్క్స్ బిల్లులు ట్రెజరీ శాఖలోకి రావాలని తెలిపారు.