Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) సౌత్ కమిటీ నాయకులు అబ్దుల్ సత్తార్
నవతెలంగాణ-ధూల్పేట్
డ్రయినేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) సౌత్ కమిటీ నాయకులు అబ్దుల్ సత్తార్ డిమాండ్ చేశారు. సంతోష్ నగర్, బాను నగర్లో గత ఐదు రోజులుగా డ్రయినేజీ పొంగిపొర్లుతున్నదనీ, అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెప్పడంతో వెంటనే సీపీఐ(ఎం) నాయకులు వెళ్లి ఆప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ పక్క వాతావరణంలో మార్పులు మరోపక్క కరోనా మహమ్మారి భయంతో ప్రజలు బ్రతుకుతున్న ఈ నేపథ్యంలో కూడా అధికారులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. గత వారం రోజులుగా డ్రయినేజీ ఇండ్ల మధ్యలో పొంగిపొర్లుతున్న పట్టించుకోకుండా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంప్లైంట్ నెంబర్ 2935, మరో నెంబర్ 5607 లకు ఫిర్యాదు చేసిన అధికారులు ఒకరిపై ఒకరు నెట్టేస్తు కాలయాపన చేయడాన్ని ఖండించారు. ఉన్నతాధకారి ఏఈ సైతం కార్యాలయంలో కలవకపోవడంతో ఫోన్ చేస్తే స్పందించక పోవడం దారుణమన్నారు. వాతావరణం మార్పుతో ఇప్పటికే ఎంతోమంది ప్రజలు అనారోగ్యాల బారిన పడ్డారని గుర్తు చేశారు. తక్షణమే ఇక్కడ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బస్తీవాసులు సమీకరించి జీహెచ్ఎంసీ దగ్గర ధర్నా చేపడతామని హెచ్చరించారు.