Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్నగర్
వైఎంసీఏ, వైడబ్ల్యుసీఏ గ్రేటర్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో 'వరల్డ్ వీక్ ఆఫ్ ప్రేయర్-వరల్డ్ ఫెలోషిప్-2021' ముగింపు కార్యక్రమాన్ని నారాయణగూడ వైఎంసీఏ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలో వారం రోజుల పాటు కోవిడ్-19, బాల్య వివాహాలు, చైల్డ్ లేబర్, మహిళలపై లైంగిక దాడులు తదితర అంశాలపై యువత, విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎంసీఏ, వైడబ్ల్యుసిఏ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు డాక్టర్ జోనాథన్ ధర్మరాజ్, బ్రూలా ఫిలిప్స్, ప్రధాన కార్యదర్శి ప్రీస్ట్లీ గయాస్ (మసి చరణ్), మాజీ ప్రధాన కార్యదర్శి, సలహాదారులు బి.జె.వినరు స్వరూప్, ఉపాధ్యక్షులు జి.ఎం.దీన్ దయాళ్, వైడబ్ల్యుసిఏ ప్రధాన కార్యదర్శి రాణి శేషాద్రి, శరణ్ సాల్మన్, డైరెక్టర్ ఎం.సతీష్ చంద్ర, ట్రెజరర్ పి.నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.