Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
తెలంగాణ ఉద్యమం తొలినాళ్ల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పద్మశాలి సామాజిక వర్గం పట్ల వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారని చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చిక్కా దేవదాస్ మండిపడ్డారు. స్వతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మొదలుకొని ఆలె నరేంద్ర, నేడు ఎల్.రమణ వరకు కేసీఆర్ మాయమాటలతో మోసం చేశారని విమర్శించారు. తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీ జాబితాలో ఎల్.రమణ పేరు లేకపోవడం పట్ల చేనేత వర్గాలపై కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధిని ప్రదర్శించారని విమర్శించారు. నేటికి చేనేత కార్మికులు వరుస బలవన్మరణాలకు పాల్పడడం బాధాకరమన్నారు. కరోనాతో కుదేలైన చేనేత కార్మికుల వృత్తిని ఆదుకునే నాథుడు కరువయ్యాడు విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం తన నిర్ణయాన్ని మార్చుకుని ఎల్.రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పద్మశాలి సామాజిక వర్గానికి గౌరవించాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.