Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మదర్ థెరిస్సా నేషనల్ ఎక్సలెన్స్ అవార్డును దమ్మాయిగూడ మున్సిపాలిటీకి చెందిన సీతంసెట్టి శ్రీనివాస రావు అందుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మెన్ వేణు చేతుల మీదుగా శ్రీనివాసరావు అవార్డును అందుకున్నారు. కరోనా సమయంలో ప్రజలకు సేవ చేయడంతోపాటు చెట్లు నాటడం, ఉచిత విద్య, ప్రజలకు కంటి ఆపరేషన్, వరద బాధితులను ఆదుకోవడం వంటి కార్యక్రమాలు చేయడంతో మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు గుర్తించి ఈ అవార్డును అందజేసినట్టు అవార్డు గ్రహీత సీతంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలకు చేసినందుకుగాను గుర్తించి అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనవం తుగా ప్రజలకు మరింతగా సేవా కార్యక్రమాలు విస్తరించి నిర్వహిస్తానని పేర్కొన్నారు.