Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్నగర్
హిమాయత్నగర్ డివిజన్లోని వాసవీలైన్, ఆయిల్ సీడ్స్ కాలనీ తదితర ప్రాంతాల్లోని స్థానికుల ఫిర్యాదు మేరకు డ్రయినేజీ, తాగునీటి సమస్యలపై డివిజన్ కార్పొరేటర్ జి.మహలక్ష్మి రామన్గౌడ్ గురువారం ఆ ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె దృష్టికి వచ్చిన పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జి.రామన్గౌడ్, శారద, జలమండలి విభాగం మేనేజర్ మహేందర్రెడ్డి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.