Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారనీ, వడ్లు కొనమని రైతులను ఇబ్బం దులకు గురి చేస్తున్న ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడ తామని అల్వాల్ సర్కిల్ అల్వాల్ డివిజన్ కాంగ్రెస్ కార్య కర్తల సమావేశంలో మేడ్చల్ మల్కాజిగిరి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ అన్నారు. పార్టీ డివిజన్ కమిటీల పునర్నిర్మాణం కోసం సభ్యత్వ నమోదు అంశాలపై కార్యకర్తలతో చర్చించి రానున్న రోజుల్లో రేవంత్రెడ్డి నాయకత్వంలో పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. పార్టీ కార్యకర్తలు సభ్యత నమోదు చేపట్టాల న్నారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు, అల్వాల్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర్య ప్రకాశ్రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు అశోక్రెడ్డి,. శ్రీనివాస్రెడ్డి, అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు వీనస్ మేరీ, డివిజన్ అధ్యక్షులు లక్ష్మి, నిర్మలా రాజ్, వాణి, శ్రీనివాస్ ఓంకార్. మహేష్, ప్రవీణ్గౌడ్, బాబు, మధు, శ్రీకాంత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.