Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
గోపు రమణారెడ్డి మాజీ సైనికుడు, స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు, జన ఔషధి కేంద్రాల నిర్వాహకులు గురువారం అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం హనుమాన్ టెంపుల్ దగ్గర 16వ ప్రధానమంత్రి భారతీయ జనఔషధి కేంద్రంను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రం, మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ కుమార్, పీఎంబీఐ నోడల్ ఆఫీసర్ దేవేందర్, స్థానిక నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రధానమంత్రి జనౌషధులు ఏర్పాటు చేసి ప్రజలకు మంచి సేవలు అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అశ్రద్ధ వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయనీ, ఎందరో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇంత తక్కువ రేటున్న జన ఔషధులను ప్రోత్సహించి ప్రతి చోటా ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. గోపు రమణారెడ్డి చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి వారిని అభినందించారు. ఈ జనౌషధి కేంద్రంలో మార్కెట్ ధరల కన్నా దాదాపు 50శాతానికిపైగా అతి తక్కువ ధరలకే లభిస్తాయి. ప్రతి ఒక్కరూ జన్ ఔషధి కేంద్రాలను సందర్శించి స్వయంగా చూసి మందులను కొనుక్కుని డబ్బులు ఆదా చేసుకోవాలని సూచించారు. దేశంలో ఇప్పటికి 8500 కేంద్రాలను ఏర్పాటు చేశామనీ, వచ్చే ఏడాది కల్లా 10 వేలు లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తామని తెలిపారు. పేదలకు డబ్బుల భారం కాకుండా ఉండాలనే ఉద్వేశంతో ఈ కేంద్రాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పీఎంబీఐ నోడల్ ఆఫీసర్ ధర్మేంద్ర, భారతీయ జనతా పార్టీ మచ్చబొల్లారం డివిజన్ ప్రెసిడెంట్ ప్రకాశ్ చౌదరి, బీజేవైఎం నాయకులు గోపి, ఓబీసీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్, సీనియర్ నాయకులు భారతీ, గోపు లక్ష్మి పాల్గొన్నారు.