Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
బాల సాహిత్యం నేటి తక్షణ అవసరమని ప్రముఖ రచయిత్రి డాక్టర్ ముక్తేవి భారతి అన్నారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సబ్భారావు కళా వేదికపై గురువారం బాలగోకులం ఏడో వార్షికోత్సవం జరిగింది. ఆకెళ్ల వెంకట సుబ్బు లక్ష్మి రచించిన చందమామ కథలు, బాలల సంక్షిప్త హనుమ చరిత్ర సంపుటిని ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ భారతి ఆవిష్కరించారు. సాహితీవేత్త డాక్టర్ జయరాములు, అధ్యక్షత వహించిన సభలో బాల సాహిత్య రచయిత చొక్కాపు రమణ, సాధన నరసింహచార్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాన సభ అధ్యక్షులు కళా జనార్దన మూర్తికి కార్మిస్తి పురస్కారం ప్రదానం చేశారు.