Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసోద్దిన్
నవతెలంగాణ-కేపీహెచ్బీ
అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసోద్దిన్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీనగర్లో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాజీవ్గాంధీనగర్లో అత్యాధునిక వసతులతో తాగునీటి పైపులైన్, సీసీ రోడ్డు, ఇతరత్రా వసతులతో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి పరుస్తున్నామన్నారు. అభివృద్ధి పనులలో జాప్యం వహించకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నార. కార్యక్రమంలో ముత్యాల దుర్గ, రమేష్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.