Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో కరోనా వ్యాధి ముంపు నుంచి నగర ప్రజలను విముక్తి చేసేందుకు గ్రేటర్ పరిధిలోని కాలనీలలో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు జీహెచ్ఎంసీ తెలిపింది. జీహెచ్ ఎంసీ పరిధిలో 4846 కాలనీలలో మొదటి డోస్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
మూడో ముంపు ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున చేపట్టేందుకు బల్దియా కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 22వ తేదీ నుంచి కాలనీలలో వాక్సినేషన్ కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, సివిల్ ఆసుపత్రుల్లో వాక్సినేషన్ వేస్తారు. ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా నగరంలో 4846 కాలనీలలో ముందు రోజు ఇంటింటి వెళ్లి గుర్తించి జాబితాను తయారు చేసి మరుసటి రోజు వాక్సిన్ వేసుకునే విధంగా సిబ్బంది కృషి చేయనున్నారు.
అంతే కాకుండా సంబంధిత ఇంటికి స్టిక్కర్ వేయనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.