Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
కథా రచయితలు తమ కథనంలో వర్తమాన సమాజాన్ని ఆర్థిక, సాంఘిక పరిస్థితుల్ని చేర్చి చరిత్రగా పాఠకులకు అందిస్తారని ప్రముఖ రచయిత మంగారి రాజేందర్ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సింగిడి రచయితల సంఘం నిర్వహణలో రవీంద్రభారతి సమావేశ మందిరంలో ఆదివారం 'బుగులు' తెలంగాణ కథలు పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఆయన కార్యక్రమానికి రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కథ గాలి, నీరులా ప్రపంచమంతా నిండిఉందని, ప్రతి వ్యక్తి ఒక కథా వస్తువేనని అన్నారు. రచయిత కాంచనపల్లి గోవర్ధన్ రాజు మాట్లాడుతూ శిల్పం, భాష పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన కథ రాయలేరని, స్పందన ఉండాలన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ బుగులు తెలంగాణ అస్థిత్వ ప్రతీక అన్నారు.
ఇందులో జీవన పోరాటం, సంఘర్షణ ఉన్నాయని సంపుటిలో కథకులు వాటిని ఆవిష్కరించారని వివరించారు. సంపుటి సంపాదకులు సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ వి.శ్రీధర్ స్వాగతం పలికిన సభలో మెర్సీ మార్గరెట్, పసునూరి రవీందర్ కొన్ని కథలను సమీక్షించారు.