Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
నేటి ప్రపంచంలో కమ్యూనికేషన్ అనేది చాలా కీలకమని, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణలో ప్రముఖపాత్ర వహిస్తుం దని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్స్ హెల్త్ కేర్లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, సొసైటీ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ ఫర్ కమ్యూనికేషన్ ఇన్ హెల్త్కేర్ సహకారంతో కమ్యూనికేషన్ 2021 అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ హాజరై మాట్లాడారు. ఒక వైద్యురాలుగా కమ్యూనికేషన్ అనేది ఎంత కీలకమో తనకు తెలుసు అని, ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపినట్లుగా 8 నుంచి 38 శాతం వరకు వైద్యులు తమ వృత్తిలో ఏదో ఒక సమయంలో శారీరకంగా, మాటల పరంగా హింసను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీనికి ముఖ్య కారణం కమ్యూనికేషన్ అనేది సరిగా లేకపోవడం అని చెప్పారు. రోగికి అర్థమైన భాషలో వివరంగా చెప్పినప్పుడే డాక్టర్లకు వారు చికిత్సకు సహకరించగలరని అన్నారు.
వైద్యులుగా సరికొత్త, అత్యంత సంక్షిప్తమైన అంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని పొందడం కూడా ముఖ్యమని అన్నారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్తో కలిసి కమ్యూనికేషన్పై ఈ సదస్సు నిర్వహించేందుకు చొరవ తీసుకున్నందుకు అపోలో హాస్పిటల్స్ యాజమా న్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఎన్బీఈఎంఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ అభిజిత్ శేది, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ప్రెసిడెంట్ డాక్టర్ కే.హరిప్రసాద్, కాడిలా ఫార్మసూటికల్స్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ ఐ మోడీ పాల్గొన్నారు.