Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, తెలంగాణ తరపున అధికారులు రిలీజ్ చేసిన 2021-2022 నోటిఫికేషన్లో పీజీ ఇన్ సర్వీస్ కోటాలో ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం ట్రైబల్, రూరల్, అదర్ సర్వీసెస్ అని చూపిస్తుందనీ, దీనివల్ల ట్రైబల్ ప్రాంతాల్లో రెండేండ్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడేండ్లు, పట్టణ ప్రాంతాల్లో ఆరేండ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి అవకాశం ఉందనీ, అధైర్యపడవద్దని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డీహెచ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్యాణ్ చక్రవర్తి, రాష్ట్ర సెక్రెటరీ జనరల్ డాక్టర్ దీన్ దయాల్, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ ప్రశాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీ ఇన్ సర్వీస్ వైద్యులు ఎంటర్ చేయాల్సిన 3ఏ, 3బీ లలో ప్రభుత్వ వైద్యులు ట్రైబల్, గ్రామీణ, అదర్స్ ఆప్షన్స్ కింద వైద్యులకు త్వరలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉన్నత అధికారులు వివరాలు ఇచ్చే విషయంలో ఆప్షన్స్ కల్పించాలని కోరగా.. దానికి అధికారులు సానుకూలంగా స్పందించించారనీ, ఈ టెక్నికల్ యర్రర్ త్వరలో మారుస్తామన్నారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పని చేస్తున్న వైద్యులకు ఇన్ సర్వీస్ కోటా అమలు తప్పక జరుగుతుందనీ, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం మీ వెంట ఉంటుందని తెలిపారు. రాబోయే రోజుల్లో బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానాల్లో పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులో ఉండాలి అంటే పీజీ ఇన్ సర్వీస్ కోటా ఇవ్వడం వల్ల ప్రభుత్వ సేవలలోకి వైద్యులు రావడానికి సులభం అవుతుంది పేర్కొన్నారు. ప్రకటన విడుదల చేసిన వారిలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, రాష్ట్ర సెక్రెటరీ జనరల్ దీన్ దయాల్, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ ప్రశాంత్, రాష్ట్ర ఉపా ధ్యక్షులు డాక్టర్ అంబి శ్రీనివాస్, డాక్టర్ వెంకటమణి, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ రవి, డాక్టర్ సిఖందర్, డాక్టర్ సంతోషిని, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీలు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మురళీకృష్ణ, మహిళా విభాగం నేతలు డాక్టర్ బిందుశ్రీ, డాక్టర్ రమ్య, డాక్టర్ సుజాత, డాక్టర్ రాజు, డాక్టర్ సుధీర్, డాక్టర్ విజరు, డాక్టర్ అరుణ, తదితరులు ఉన్నారు.