Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
ప్రముఖ సినీ రచయిత జె.కె.భారవి కి ఆత్రేయ-ప్రియ శిష్య పురస్కారం ఈ నెల 26 న బహుకరిస్తున్నట్లు యువ కళావాహిని సాంస్కతిక సంస్థ అధ్యక్షులు కార్యదర్శి లంక లక్ష్మీనారాయణ, మల్లికార్జున్ ప్రకటించారు. రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ మినీ థియేటర్లో ఆత్రేయ జయంతిని పురస్కరించుకొని జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ పాల్గొంటారు. పారిశ్రామికవేత్త సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించగా సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ, సుద్దాల అశోక్ తేజ, రెంటల జయదేవ్, రేలంగి నరసింహ రావు తదితరులు హాజరుకానున్నారు.