Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
బాలానగర్ పీఎస్ పరిధిలో ఇద్దరు అదృశ్యమయ్యారు. సీఐ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం చెన్నారెడ్డి నగర్లో నివాసం ఉంటున్న కూతురు అల్లుడు దగ్గరికి వచ్చిన కరణం రాజేశ్వర్ రావు (65) ఈనెల 21న బయటకు వెళ్లొస్తానని బయటకు వెళ్లిన వద్ధుడు తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల వారిని, బంధువులను విచారించినా అతని ఆచూకీ లభించలేదు. సోమవారం అల్లుడు శ్రావణ్ కుమార్ బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.గౌతంనగర్లో నివాసం ఉంటున్న అబ్దుల్ రజాక్ (16) ఐడీపీఎల్లోని గీతాంజలి జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 21న బయటకు వెళ్ళొస్తానని తలిదండ్రులకు చెప్పి వెళ్లాడు. కుమారుడు ఎంతకూ తిరిగి రాకపోవడంతో స్నేహితులను, తెలిసినవారిని విచారించినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి అబ్దుల్ రహీం బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.