Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ప్రయివేటు కంపెనీలలో పని చేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్, వేతనాల్లో కోత, ఆర్టీసీ కార్మికులు సమస్యల పరిష్కారానికి చొరవతీసుకోవాలని టీటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి కుమార్ కోరారు. ఈమేరకు టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డిని సోమవారం తార్నాకలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కార్మిక సమస్యలపై చర్చించారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యూనియన్ నాయకులు సుద్దాల సురేష్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.