Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్
నవతెలంగాణ-ఓయూ
ఓయూ డిగ్రీ, ఇన్స్టంట్ పరీక్ష ఫలితాలు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఓయూ రిజిస్టర్ ప్రొ. లక్ష్మీనారాయణను కలిసి వినతి పత్రం అందజేశారు. కరోనా కారణంగా జూన్, జులైలో నిర్వహించిన పరీక్షలకు విద్యార్థులు హాజరు కాకపోతే వారికి మరొక అవకాశం కల్పిస్తామని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. 1,2,6 సెమిస్టర్లో బ్యాక్లాగ్ ఉన్న ఐసెట్, పీజీ సెట్ ఉత్తీర్ణులైన ఉపయోగం లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు క్రాంతి, ఉస్మానియా యూనివర్సిటీ కార్యదర్శి క్రాంతిరాజ్, మేడ్చల్ జిల్లా నాయకులు టి హరీష్ పాల్గొన్నారు.