Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీయూడబ్ల్యూజే యూనియన్ మేడ్చల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గణేష్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని మేడ్చల్ నియోజకవర్గ టీయూడబ్యుజె (ఐజెయూ) యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.గణేష్ అన్నారు. మేడిపల్లి మండలంలోని ఎస్వీఎం రెస్టారెంట్లో జరిగిన మేడ్చల్ నియోజకవర్గ టీయూడబ్యుజె (ఐజెయూ) యూనియన్ నూతన కమిటీ ఎన్నికల్లో కీసర మండల కేంద్రానికి చెందిన కె.గణేష్ (సూర్య పత్రిక ) విలేకరి నియోజక వర్గ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా నియమితు లైనట్టు యూనియన్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాల రాజు గౌడ్ ప్రకటించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తానని పేర్కొన్నారు. జిల్లా యూనియన్, మేడ్చల్ నియోజకవర్గం సభ్యుల సహకారంతో జర్నలిస్టుల కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.