Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
హయత్నగర్ డివిజన్లోని అనుమగల్ బస్తీ హరిజన వాడాలో 1.26 లక్షలతో గత ఏడాది 12/11/2020 నాడు నాటి కార్పొరేటర్ శంకుస్థాపన చేసినా కూడా ఇప్పటికీ అట్టి ప్రాంతంలో పనులు ప్రారంభించకపోవడం ఏంటని హయత్నగర్ టీఆర్ఎస్ నాయకులు కాటపాక స్కైలాబ్ ప్రశ్నించారు. మంగళవారం దళితవాడపై దయ ఉంచి దయచేసి మా వాడాలో త్వరగా రోడ్లు వేయాలని, వద్ధులు, పిల్లలు నడవ డానికి ఇబ్బందిపడుతు న్నారని, ద్విచక్ర వాహనా దారులు రోడ్లు బాగలేక కిందపడుతున్నారని, త్వరగా పనులు ప్రారంభించాలని జీహెచ్ఎంసీ, డీఈ దామోదర్ రావుకు విన్నవించారు.