Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
జర్నలిస్టులు ఉత్తమ సమాజ నిర్మాణం కోసం పనిచేసే వారని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారానికి నిరంతరం కషి చేస్తారని పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు మేడ్చల్ నియోజకవర్గం టీయూడబ్యూజె-ఐజేయూ సర్వసభ్య సమావేశం, నూతన కమిటీ ఎన్నిక స్థానిక ఎస్వీఎం గ్రాండ్ హోటల్లో జరిగింది. ఈ సమావేశానికి టీయూడబ్యూజె-ఐజెయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మోతే వెంకట్రెడ్డి అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి గడ్డమీది బాల్రాజుతో పాటు మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు మోతే వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాల్ రాజులు మాట్లాడుతూ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేసేందుకు యూనియన్ పనిచేస్తుందని అన్నారు. రాబోయే కాలంలో స్థానిక జర్నలిస్టుల సమస్య లను మంత్రి మల్లారెడ్డి దష్టికి తీసుకుపోతామని అన్నారు.
నూతన కమిటీ ఎన్నిక :
టీయుడబ్యూజె-ఐజెయూ మేడ్చల్ అసెంబ్లీ నియోజక వర్గం కమిటీ అధ్యక్షుడిగా వెల్లంకి జయపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె.గణేష్, వర్కింగ్ ప్రెసిడెంట్గా జే.కే హరినాధ్, డిప్యూటీ కార్యదర్శి దయానంద్, కోశాధికారిగా కె.నాగరాజు, ఉపాధ్యక్షులుగా గోవింద్ రాజు, నర్సింహా రావు, సునీల్ వర్మ, సహాయ కార్యదర్శులు కె.నాగభూషణ చారి, నరసింహ, భవానీ శంకర్, కార్యవర్గ సభ్యులగా శ్రీధర్రెడ్డి, సుందర్, పరమేష్, సత్యనారాయణ, నాగరాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల ప్రెస్క్లబ్ అధ్యక్షుడు సంకూరి మురళి, ప్రధాన కార్యదర్శి కల్కూరి ఎల్లయ్య, కార్యవర్గ సభ్యులు,ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.