Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమిషనర్ కష్ణ మోహన్ రెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
దేశ వ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో 4320 పట్టణాల్లో నిర్వహించగా అందులో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన కొన్ని మున్సిపాలిటీ లకు ఉత్తమ అవార్డులను ప్రదానం చేయటం జరిగిందని కమిషనర్ కష్ణ మోహన్రెడ్డి తెలిపారు. అందులో 50వేలు, 1లక్ష జనాభా ఉన్న క్యాటగిరిలో దక్షణ భారత దేశంలోనే బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 4వ ర్యాంకు సాధించిందని అయన తెలిపారు.
గత సంవత్సరం 498 ర్యాంక్ సాధించి సిల్వర్ మెడల్ సాధించిందన్నారు. రాష్ట్రంలో 2వ స్థానం దక్కటానికి సహకరించిన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రంశేఖర్, మున్సిపల్ కార్పొరేటర్లకు, నిరంతరం కషి చేసిన పారిశుధ్య కార్మికులకు అభినందనలు తెలిపారు.