Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
రైతు ఉద్యమం దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపిందనీ, ఈ ఉద్యమంతో యువత ఉద్యోగ అవకాశాల కోసం పోరాటానికి శ్రీకారం చుట్టాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్కుమార్ అన్నారు. ఏఐవైఎఫ్ఎఫ్ హస్మత్పేట మండల రెండో మహాసభ నిర్వహించగా ఏఐవైఎఫ్ నాయకులు హైమత్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లా డుతూ మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని నెలలుగా రైతులు చేసిన స్ఫూర్తిదాయక పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందన్నారు. రైతు న్యాయమైన డిమాండ్లకు మెడలు వంచి దేశ ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ కోరుతూ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్టు చేసిన ప్రకటన స్వాగతించదగ్గ పరిణామం అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజా ఆమోదయోగ్యమైన చట్టాలను రూపొందించాలే తప్పా కార్పొరేట్ అనుకూల చట్టాలను రూపొందిస్తే ప్రజా పోరాటాలు, తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలను నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తామన్న సీఎం మాటలు నీటి మూటలే అయ్యాయన్నారు. ఏడేండ్ల పాలనలో కేసీఆర్ ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో వేలాది ఖాళీలు ఉన్నాయనీ, ఈ ఖాళీలను తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీ బోర్డు ద్వారా జాబ్ మేళాలు నిర్వహించాలనీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులు నిర్వహించి యువతకు ఉపాధి కల్పించవచ్చని వారు ఉద్ఘాటించారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సత్య ప్రసాద్ సల్మాన్ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీ బోర్డు ప్రత్యేక ఉద్యోగ మేళాలను నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ మహాసభలో జాంగీర్, అర్జున్, ఖలీల్, కరీంలతో పాటు 40మంది పాల్గొన్నారు. అనంతరం అల్వాల్ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఎండీ ఇమ్రాన్, ప్రధాన కార్యదర్శిగా ఎండీ మహ మ్మద్, ఉపాధ్యక్షుడ ిగా కరీం, సహాయ కార్యదర్శిగా అల్తాఫ్, కోశాధికారిగా ఎండీి కరీంతో పాటు 19 మంది కౌన్సిల్ సభ్యుల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.