Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీలో జరిగిన ఘటనపై కేసు నమో దయింది. 32 మంది బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై జీహెచ్ఎంసీ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. జీహెచ్ఎంసీ ఆఫీసులో బీజేపీ కార్పొరేటర్లు హంగామా చేశారు. సైఫాబాద్ పోలీసులు జీహెచ్ఎంసీలోని సీసీ ఫుటేజ్ సేకరించి, దాని ఆధారంగా కేసులు నమోదు చేశారు. బీజేపీ మెరుపు ధర్నాతో బల్దియా కార్యాలయంలో బీభత్సం సష్టించిన సంగతి తెలిసిందే. నిరసనలో భాగ ంగా బీజేపీ కార్యకర్తలు పూల కుండీలను పగలగొట్టారు. మేయర్ ఛాంబర్లో భైఠాయించి ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకర్తలు టేబుల్ విరగొట్టారు. వారంతా ఛాంబర్లోకి దూసుకెళ్లినా పోలీసులు అడ్డుకోలేకపో యారు. గ్రేటర్ కార్యాలయం అంతా పూల కుండీల మట్టితో నిండిపోయింది. మేయర్ ఛాంబర్లో ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. బల్దియా ఆఫీస్లో మేయర్కు, ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు పోస్టర్లు అంటిం చారు. జీహెచ్ఎంసీ బోర్డుపై బ్లాక్ స్ప్రే కొట్టి నిరసన తెలిపారు. మేయర్, కమిషనర్ ఛాంబర్ల వద్ద కార్పొ రేటర్లు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు తలుపులు తోసు కుంటూ దూసుకెళ్లారు. మెరుపు ధర్నాను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. జనరల్ బాడీ మీటింగ్, గ్రేటర్కు నిధులు కేటాయించాలనే డిమాండ్తో బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. బల్దియాలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గ్రేటర్ హైద్రాబాద్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నడుస్తోంది. నిన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. బీజేపీ ధర్నాకు కౌంటర్గా టీఆర్ఎస్ కార్పొరేటర్లు బుధ వారం మేయర్ ఛాంబర్ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు.
మంత్రి కేటీఆర్ ఖండన
జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. 'బీజేపీ కార్పొరేటర్లు రౌడీలు, గుండాల్లా వ్యవహరించారు. బీజేపీ కార్పొరేటర్ల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గాడ్సే భక్తులు గాంధీ మార్గాన్ని అనుసరిస్తారని ఎలా అనుకుంటారు?' అంటూ ఎద్దేవా చేశారు. ఈ ఘటనపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.