Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూబ్లీహిల్స్ పరిధిలోని టి అంజయ్యనగర్ మహిళల నిరసన
- వైన్స్ గనుక ఏర్పాటు చేస్తే కోర్టుకెళ్తామంటున్న మహిళలు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం, రహమత్ నగర్ డివిజన్ పరిధిలోని ఎస్పీఆర్ హిల్స్ దగ్గరలోని టి.అంజయ్య నగర్లో, కాకతీయ వైన్స్ను వెంటనే తొలగించాలని, తిరిగి ఈ సంవత్సరం ఇక్కడ వైన్స్కు అనుమతి ఇవ్వవద్దని స్థానిక మహిళలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. తమ బస్తీలో వైన్షాప్ పెట్టకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒకవేళ పెడితే కోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో టి. అంజయ్య నగర్ బస్తీ అధ్యక్షురాలు పూజ ఆండాలు, బస్తీ యూత్ నాయకుడు ఎస్. శివ, ఎల్లన్న, ఇబ్రహీం, చిట్టి, లత, బాలమ్మ, తదితరులు పాల్గొన్నారు.