Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
అరుగాలం శ్రమించిన రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రాకపో వడంతో తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని, రైతులను అందుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందాయని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రాంతంలో గత నెల రోజులుగా పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు కల్లంలో పడిగాపులు కాస్తు న్నారని, కొంత మంది రైతులు ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా మత్యువాత పడ్డారని వాపోయారు. కేంద్రం కొనటం లేదంటూ రాష్ట్రం ప్రభుత్వం చెప్తుంటే దానికి సమాధానం చెప్పాల్సిన బీజేపీ రైతుల పరామర్శ పేరుతో కొత్త నాటకానికి తెరతీశారని వాపోయారు. రైతు సమస్యలు పక్కన పెట్టి కేవలం రాజకీయ పోరాటం చేస్తూ రైతుల సమస్యలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ''అమ్మకి అన్నం పెట్టనోడు పిన తల్లికి బంగారు గాజులు చేయించాడట'' అలా ఉంది ఈయన తీరు అంటూ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు సమస్యలను పరిష్కరించడానికి, పరామర్శించడాని సమయం కేటాయించని కేసీఆర్ ఉత్తరాదిలో చనిపోయిన రైతులకు రూ.3లక్షల ఆర్థిక సహాయం అంటూ కొత్త నాటకానికి తేర తీశారని వాపోయారు.
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అండగా నిలిచి చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేసేందుకు గాను ఏఐసీసీ, టీ.పీసీసీ పిలుపు మేరకు గురువారం నాడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందచేయనున్నట్లు వజ్రేష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతి నిధులు, వివిధ విభాగాల నేతలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.