Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో, కోఠి ఉమెన్స్ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకట్టుకుంటుంది. గురువారం తెలంగాణ రుచులు పేరిట విద్యార్థినులకు వంటల పోటీలు నిర్వహించారు. నగరానికి చెందిన పలు కళాశాల విద్యార్థినులకు అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ కట్టు, బొట్టు నృత్యాలతో అలరించారు. భారత రాజ్యాంగ విలువలను దేశ ప్రజలలోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో శుక్రవారం వకృత్వ, క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నామని అసిస్టెంట్ డైరెక్టర్ ఇనుముల హరిబాబు తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం, దాని విశిష్టత గురించి తెలియచేసే ఫోటోలను కూడా ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో చాట్ ఇన్చార్జ్ డాక్టర్ అరుణ పారిటి, ఆర్గనైజర్లు
శైలజ, ఉమారాణి పాల్గొన్నారు.