Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
రాష్ట్రంలో మద్యం షాపులు, మద్యం షాపుల రిజర్వేషన్లు పెంచడం కాదు.. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఓల్డ్ నేరేడ్మెట్లోని ఎస్ఎస్ గార్డెన్స్లో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లేల రవి యాదవ్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆనంద్ బాగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కార్పొరేటర్లు, నాయకులు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఈటల రాజేందర్ను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదని, తెలంగాణ బానిస సంకెళ్లను బద్దలు కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు నాయకులను గడ్డిపోచతో పోల్చడం అలవాటని, ఈటల గడ్డిపోచ కాదు గడ్డపార అని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు నిరూపించారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నందనం దివాకర్, కార్యదర్శి సంజరు గణాటే, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్, స్థానిక బీజేపీ కార్పొరేటర్లు వి. శ్రావణ్ కుమార్, క్యానం రాజ్యలక్ష్మి, సునీత యాదవ్, సీనియర్ నాయకులు బాల్ లింగం, వీకే మహేష్, ఓబీసీ మోర్చా మేడ్చల్ (అర్బన్) జిల్లా ఇన్చార్జ్ కాలేరు రామోజీ, అధ్యక్షులు మంగేష్, కుమార్, ప్రధాన కార్యదర్శులు కిషోర్, కుమార్, పోలాకి, దుర్గా, రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ గౌడ్, డి సంతోష్ కుమార్, వినయ శంకర్, గోపాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.