Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
ప్రజా సమస్య లు పరిష్కరించడం కోసం హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్ బుధవారం కార్పొరేటర్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో ఉన్న డ్రయినేజీ, రోడ్లు, వీధి లైట్స్, సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. కాలనీలో అక్రమ నిర్మాణాలను అరికట్టాలి అన్నారు. కార్పొరేటర్స్ తమ సమస్యలను డిప్యూటీ కమిషనర్ దష్టికి తీసుకొచ్చారు. కార్పొరేటర్లు మాట్లాడుతూ అధికారులు కలువడం లేదని తమ అసంతప్తిని వ్యక్తం చేశారు. తాము చెప్పిన పనులు చేయడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కార్యక్రమంలో బీఎన్ రెడ్డి కార్పొరేటర్ లచ్చి రెడ్డి, నాగోల్ కార్పొరేటర్ అరుణ సురేందర్ యాదవ్, మన్సూరా బాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి, ప్రవీణ్ రెడి,్డ అధికారులు హెల్త్ అధికారి మంజుల వాణి, టౌన్ ప్లానింగ్ అధికారి సుస్మిత పాల్గొన్నారు.