Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్ పేట
ఎయిడ్స్ను అంతం చేయండి అనే నినాదంతో ఒకే మాట ఒకే బాటగా ప్రపంచమంతా ముందుకు సాగుతుందని తుర్కపల్లి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ డాక్టర్ ఎంపల్లి సృజన పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా తుర్కపల్లి గ్రామపంచాయతీలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ డాక్టర్ సృజన ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఎయిడ్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ మహమ్మారి పై ప్రజల్లో అవగాహన పెంచడం కోసమే డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఎయిడ్స్ రోగుల్లో భరోసా నింపడమే ఎయిడ్స్ డే ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ మహా కార్యంలో స్వచ్ఛంద సంస్థలు అన్ని వర్గాలు పాల్గొనడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లలిత, ఆశా కార్యకర్త సంతోష, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.