Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
జవహర్నగర్లో పలు అభివృద్ధి పనులను మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్లు నరసింహారెడ్డి, సాంసన్లు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మేకల కావ్య, కమిషనర్ జ్యోతి రెడ్డితో కలిసి కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్ఛభారత్, పట్టణ ప్రగతి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రజలు అందరూ సహకరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తుందని తెలిపారు. ఇప్పటికే జవహర్నగర్లో పలు అభివృద్ధి పనుల కోసం కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. మార్కెట్ యార్డు కోసం ప్రధాన రహదారికి అనుకూలంగా ఉన్న స్థలాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.