Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని భ్రమరాంబిక నగర్లో స్థానిక సమస్యలను తెలుసుకోవడానికి శుక్రవారం స్థానిక కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్థానిక సమస్యలు ముఖ్యంగా రోడ్లు, సేవరేజ్, ప్రజల సమస్యలు సంబంధించిన అధికారుల వద్దకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం సీతారాం నగర్ శివాలయం వద్ద ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిషన్, రాజు, కుమార్, కాలనీ సభ్యులు శ్యామల, శాస్త్రి, శ్రీనివాస్, రఘువీర్, బీజేపీ నాయకులు కిషన్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.