Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్కు చెందిన వంగూరి సహజ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజినీరింగ్ విద్యా సంస్థ ఐఐటీ ముంబయిలో సీటు సాధించింది. ఐఐటీ చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఆటంకంగా మారడంతో పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ సంస్థ ప్రతినిధులు సిద్దు, ప్రవీణ్, రవి, సంతోష్ రూ.33వేలు ఆమెకు ఆర్థిక సాయం చేశారు. భవిష్యత్లో సహజ ఐఐటీ చదువును ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించేందుకు నిరంతరం అండగా ఉంటామని సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విద్యార్థినీ తండ్రి వంగూరి గోపాలరావు, సీనియర్ జర్నలిస్ట్ నాగవర్ధన్ రాయల తదితరులు పాల్గొన్నారు.