Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
క్యాబ్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్ల పిల్లలకు గురుకుల పాఠశాలలో చదువుకునే అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డ్రైవర్లకు హామీనిచ్చారు. మంగళవారం కనెక్టెడ్ క్యాబ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓల్డ్ బోయిన్పల్లిలోని తెలంగాణ గార్డెన్లో మొదటి సంవత్సర వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజ కవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, డైరెక్టర్ చంద్రశేఖర్ హాజరై డ్రైవర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ శ్రామ్లో డ్రైవర్ల పేర్లను రిజిస్ట్రేషన్ చేయించారు. డ్రైవర్లు భారీ సంఖ్యలో పాల్గొని ఈ శ్రామ్ రిజిస్ట్రేషన్ సెంటర్లలో వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లా డుతూ డ్రైవర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందనీ, ఇందులో భాగంగానే వారికి ఈ శ్రామ్ నమోదు కార్యక్రమం కూడా చేస్తున్నామనీ, ఈ సమయంలో కూడా డ్రైవర్లు కష్టనష్టా లకు గురై పని చేశారనీ, ప్రయాణికులకు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్ల పిల్లల సంక్షేమం, వారి చదువుల కోసం గురుకుల పాఠశాల్లో వారికి అవకాశం కల్పించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ డ్రైవర్ల సంక్షేమం కోసం ఎల్లవేళలా టీఆర్ఎస్ ప్రభుత్వం అందుబాటులో ఉంటుందన్నారు. పిలిచిన వెంటనే డ్రైవర్లకు సాయం చేసేందుకు తాను అందుబాటులో ఉంటానని తెలిపారు. తన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని చెప్పారు. అంతకుముందు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న నియోజకవర్గంలోని డ్రైవర్ల అందరికీ తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తామనీ, ఏ సమస్య ఉన్నా తమ దృష్టి కి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్.శ్రీనివాస్, టాక్సీ సెక్టార్ నాయకులు నాగేష్ కుమార్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.