Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
రంగారెడ్డి నగర్ డివిజన్ వెంకటరామిరెడ్డి నగర్లోని శ్రీసీతారామాంజనేయ విశ్వేశ్వరస్వామి ఆలయంలో అయ్యప్పస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో గత నెల 27 నుంచి జనవరి 10 వరకు నిత్యాన్నదానం నిర్వహించనున్నట్టు ఆలయకమిటీ, అయ్యప్పసేవా సమితి అధ్యక్షులు రాగి రామకృష్ణ ముదిరాజ్ తెలిపారు. ప్రముఖ సంఘ సేవకులు, దాత ఎస్ మురళి కృష్ణ ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షులు రాగి రామకృష్ణ ముదిరాజ్ అధ్యక్షులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు రాకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. అనంతరం దాతను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి పి. రాజిరెడ్డి, సభ్యులు ఎన్ మహదేవ్, రఘునాథ్రెడ్డి, మోహన్రెడ్డి, పాండు, యాదగిరి, లక్ష్మమ్మ, కిశోరిదేవి పాల్గొన్నారు.