Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో మేలు అని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్టకు చెందిన బెలిదే నవీన్ కుమార్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకుని ఆర్థిక ఇబ్బంది పడుతున్న విషయం ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలుసుకుని ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా.. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 55 వేల చెక్కును అందజేశారు.