Authorization
Sat March 22, 2025 10:00:26 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలోని ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు శ్రీ గణేష్ ఫౌండేషన్ చైర్మెన్ శ్రీ గణేష్ పాదయాత్రలు ముమ్మరం చేశారు. ఆదివారం మడ్ ఫోర్ట్లో స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు పరిష్కారం కోసం శ్రీ గణేష్ పాదయాత్ర చేశారు. మడ్ ఫోర్ట్, ముత్యలమ్మ ఆలయ సమీ పంలో డ్రయినేజీ సమస్య ఉందని ఈ సందర్భంగా స్థానికులు శ్రీ గణేష్కు చెప్పారు. ఇతర సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తానని స్థానికులకు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.