Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
గోశామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా అవుతుందనీ, ఆ నీటిని తీసుకెళ్లి రెడ్హిల్స్లోని వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ సంతోష్కు గోశామహల్ టీఆర్ఎస్ నాయకుడు ఎం.ఆనంద్ కుమార్ గౌడ్ చూపించి సమస్యను వివరిం చారు. జాంబాగ్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో సమస్య ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే ఆయా ప్రాంతాల్లో పర్యటించి సమస్యను పరిష్కరిస్తామని జీఎం హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాంబాగ్ డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎం.శ్రీనివాస్ గౌడ్, నరేష్, భాస్కర్, రఘు, తదితరులు పాల్గొన్నారు.